Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరాలి..!

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మంగళవారం రాత్రి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు చరిత్ర ఉందన్నారు. ఇది ఒక పోరాటాల గడ్డ అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజా పోరాటాల పై పోరాటం చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయన్నారు.

ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అన్నారు. వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు బిల్లా రంగాలుగా మారారు అన్నారు. ఇదొక దండుపాళ్యం  ముఠా అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. వరంగల్లో ఉన్న భూములను ఆక్రమించుకొని వందలు సంపాదించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వరంగల్లో అభివృద్ధి శూన్యం అన్నారు 9 ఏండ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు.

సీఎం చంద్రశేఖర రావు చేసిన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి అంటూ రేవంత్ రెడ్డి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, మాజీమంత్రి కొండా సురేఖ, డిసిసి అధ్యక్షుడు  రాజేందర్రెడ్డి ,మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కొండ సుస్మిత పటేల్ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news