Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాంగ్రెస్ పార్టీకి శుభాభినందనలు : మంత్రి కేటీఆర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.

అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రభావంపై చూపుతాయని అనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు.
భారతదేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు నగరాలను మరింత ఎత్తుకు ఎదగనిద్దామని, ఆరోగ్యకరమైన పోటీతో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనలో ఇంకా ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందిద్దామని పిలుపునిచ్చారు.

RSS
Follow by Email
Latest news