Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అరుణాల్ ప్రదేశ్ తమదేనన్న చైనా… అమిత్ షా పర్యటనపై అభ్యంతరం…

అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన రెండు రోజులపాటు కొనసాగనుంది. తన పర్యటనలో భాగంగా ఇండియా-చైనా సరిహద్దులో ఉన్న కిబితూ గ్రామంలో అమిత్ షా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంను లాంచ్ చేయనున్నారు. ఆయన పర్యటన పట్ల చైనా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని… అక్కడ అమిత్ షా పర్యటించడం తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుందని చైనా ప్రకటించింది. ఇలాంటి చర్యల వల్ల ఇరు దేశాల మధ్య శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల పేర్లను గత నెలలోనే చైనా మార్చింది. ఆ రాష్ట్రాన్ని చైనా జాంగ్నాన్ అని పిలుస్తోంది. జాంగ్నాన్ లో భారత నేతలు, అధికారులు పర్యటించడం సరిహద్దు సమస్యలు పరిష్కారం కావని   చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

ఈవిషయంపై  భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి ఈ అంశంపై స్పందిచారు. చైనా ఇలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదని అన్నారు. గతంలో చైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా మనం తిప్పికొడుతూనే వచ్చామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్ లో అంతర్భాగమని అన్నారు. చైనా కొత్తగా పేర్లను పెట్టడం ద్వారా ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. ఇదే అంశంలో అమెరికా సైతం ఇండియాకు మద్దతుగా నిలిచింది. చైనా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ప్రకటించింది.

RSS
Follow by Email
Latest news