తెలంగాణలో లో కురుస్తున్న బారి వర్షాలకు అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతుండటంతో డ్యామ్ కు ఉన్న 17 గేట్లను తెరిచి నీటిని దిగువకు పంపిస్తున్నారు. కానీ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్న… అంతకంటే ఎక్కువ నీరు వచ్చి చేరుతుండటంతో…గేట్ల పైనుంచి కూడా నీరు క్రిందకి ప్రవహిస్తుంది. దింతో ఏక్షణంలో అయినా ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉందని, సంబంధిత అధికారులు డేంజర్ బెల్స్ మోగించారు. దీంతో డ్యామ్ కింది ప్రాంతాల ప్రజలను అధికారులు, పోలీసు యంత్రాంగం కాళీ చేయిస్తూ.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇన్ ఫ్లో ..అవుట్ ఫ్లో…
సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యామ్ కు ఉన్న 17 గేట్లను తెరిచి 2.5 లక్షల నీటిని కిందకు వదులుతున్నారు.