Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బీజేపీ, బిఆర్ ఎస్ రెండు ఒకటే…!

భాజపా, భారాస రెండూ మిత్రపక్షాలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ముఖ్యఅతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరైనారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ… తెలంగాణ కోసం అన్ని వర్గాల వారు పోరాటం చేస్తే.. క్రెడిట్ అంతా ఒకే వ్యక్తి తీసుకున్నారని ఖర్గే విమర్శించారు. “కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి ప్రజల మనసు తెలుసుకొని సోనియా తెలంగాణ ఇచ్చారని వివరించారు. కానీ, తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ ఇప్పుడు చెబుతున్నారు.అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. 53 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశాం. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయి? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాం” అని ఖర్గే వెల్లడించారు. ప్రజాగర్జన సభకు పార్టీ నాయకులతోపాటు, భారీ స్థాయిలో కార్యకర్తలు తరలివచ్చారు.

RSS
Follow by Email
Latest news
కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనచర్ల ప్రాజెక్ట్ : సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ తో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలు హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల త్వరలో తెరకెక్కనున్న రజినీకాంత్, కమల్ భారీ ప్రాజెక్ట్ : నేటి నుండి మన శంకర వరప్రసాద్ గారు మూవీ .. నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు : చంద్రబాబు వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి..