Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బిగ్ ట్విస్ట్… అధిష్ఠానం పిలుపు.. విమానాశ్రయం నుండి వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి..!

  • పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్
  • అధిష్ఠానం పిలుపుతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి మహారాష్ట్ర సదన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశం

అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఈక్రమంలో ఢిల్లీ పెద్దలను అందరిని కలిశారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి పలువురు నేతలను కలుస్తున్నారు. నిన్న రాత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. పలువురు నేతలు మిఠాయి తినిపించి.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం వరకు వచ్చిన ఆయనకు ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో రేవంత్ మళ్లీ వెనక్కి వెళ్లారు. విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు ఆయన వెళ్లారు. పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

వచ్చేందుకు

RSS
Follow by Email
Latest news