Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రేపే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ…!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఈనేపథ్యంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని కౌంటింగ్ కేంద్రాలు అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 224 నియోజకవర్గాలకు ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే  విషయంపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని ఏజెన్సీలు హంగ్ ఏర్పడుతుందని చెపుతున్నాయి. మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ గెలుచుకుని అధికారాన్ని హస్త గతం తెలుపుతున్నాయి. హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ (సెక్యులర్) కీలక పాత్ర పోషించడంతో కాంగ్రెస్‌కు స్వల్ప ప్రయోజనం చేకూరుతుందని మరికొన్ని ఏజెన్సీలు సూచిస్తున్నాయి.

RSS
Follow by Email
Latest news