తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. అహంకారానికి అనుభవరాహిత్యం తోడైన వ్యక్తి కేసీఆర్ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కట్టిన ప్రాజెక్టులు కేసీఆర్, అయన కుటుంబానికి కమీషన్ల పంట పండించాయని ఆరోపించారు. చరిత్రలో నిరుపయోగమైనటువంటి ప్రాజెక్టును కట్టిన చరిత్ర కేసీఆర్ దేనని అన్నారు.
కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రానికి ఉపయోగం ఉందని కెసిఆర్ నిరూపించగలవా ? అని సవాల్ విసిరారు. అలాగే, మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ లో 50 టీఎంసీల నీరు నింపే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులకు, టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు చాలా తేడా ఉందని అన్నారు. నీటి కోసం పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్ దని చెప్పారు.