Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ… కాంగ్రెస్ కండువా కప్పుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు  ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి చేరారు. ఈరోజు ఉదయం 9 గంటలకు మనోహర్‌రెడ్డి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ భేటీ జరిగింది. దీనికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరైనట్టు తెలిసింది. కాగా, కాంగ్రెస్‌లో చేరుతున్న మనోహర్‌రెడ్డికి తాండూరు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఇప్పటికే భేటీ అయిన ఆయన పార్టీని వీడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

RSS
Follow by Email
Latest news