వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట అయ్యా కొడుకు లు మరో లూటీకి తెర తీశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను రైతులనుంచి అతి తక్కువ ధరకే లాక్కున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ఇప్పటికే తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించారని రేవంత్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్పై కీలక ఆరోపణలు చేశారు.
