నిన్నటితరం ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు ప్రతాప్ పోతన్ ..కేరళ – తిరువనంతపురంలో 1951 ఆగస్టు 13వ తేదీన ఆయన జన్మించారు. 1978లో మలయాళ సినిమా ద్వారా నటుడిగా వెండితెరకి పరిచయమయ్యారు. వైవిధ్యభరితమైన ఆయన నటన ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన కెరియర్ ఆరంభంలో హీరోగా చేసినప్పటికీ, ఆయన ఒక మంచి నటుడు అనే బాలచందర్ ప్రశంసించారు.
కేవలం ఒకే ఒక స్మైల్ తో ప్రతాప్ పోతన్ తనలోని విలనిజాన్ని బయటపెట్టేవారు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలికించేవారు. చకచకా ఎక్స్ ప్రెషన్స్ మార్చే అరుదైన నటుల్లో ప్రతాప్ పోతన్ ఒకరుగా చెబుతారు. మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, ఆ తరువాత కాలంలో తమిళంలో బిజీ అయ్యారు. అడపా దడపా తెలుగు తెరపై కూడా మెరిశారు.
‘ఆకలి రాజ్యం’ .. ‘కాంచనగంగ’ .. ‘జస్టీస్ చక్రవర్తి’ వంటి సినిమాలు తెలుగులో ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1985లో ప్రముఖ నటి రాధికను ఆయన వివాహం చేసుకున్నారు. అయితే, ఎక్కువ కాలం వారి వైవాహిక జీవితం సాగలేదు. అనంతరం మరో వివాహం చేసుకున్నారు. వారికీ ఓకే అపప కూడా ఉంది. చెన్నై లోని అయన అపార్టుమెంట్ లో నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.