Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కాబూల్‌లో భారీ పేలుడులో 66 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ లో భారీ పేలుడు సంభవించింది. ఖలీఫా సాహిబ్ మసీదులో జరిగిన ఈ ఘటనలో 66 మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. రంజాన్ చివరి శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం  మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయని, అలాగే, మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సున్నీ ముస్లింలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. రంజాన్ పర్వదినం ఏంటో సంతోషంగా జరుపుకోవాల్సిన పలువురు ప్రజలు అసువులుబాయడం బాధాకరం అంటూ…ఆవేదన వ్యక్తం చేసింది.కాగా, ఈ పేలుడు ఘటనపై ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ స్పందించలేదు. కాగా, ఈ ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు.

RSS
Follow by Email
Latest news