Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల బాటలో పయనించాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 507.73 పాయింట్లు పెరిగి 74,616.58 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 155.40 పాయింట్లు లాభపడి 23,123.65 వద్ద ముగిసింది.

ఆరంభంలో ఆచితూచి సాగినప్పటికీ, చివరి సెషన్‌లో ఐటీ, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. నిఫ్టీలో విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్ అత్యధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి.

అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయింది. బ్రాడర్ మార్కెట్‌లో మిశ్రమ స్పందన కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం స్వల్పంగా లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.06% మేర నష్టపోయింది. ఇక రంగాల వారీగా…  ఐటీ, రియల్టీ, మెటల్ సూచీలు లాభాల్లో కొనసాగాయి.

RSS
Follow by Email
Latest news