Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ ని ఆహ్వానించిన మంత్రి అజారుద్దీన్

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ ని కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ… “గౌరవ ముఖ్యమంత్రి ని ఈ పవిత్ర రంజాన్ మాసంలో మార్చి 15న జరిగే ఇఫ్తార్ విందుకు ఆహ్వానించానన్నారు. ఈ పవిత్ర సమయం అందరిలో శాంతి, కృతజ్ఞత, ఐక్యతను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని తెలిపారు.

ఈ మాసంలో నాయకులు, ప్రముఖులు మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి అజారుద్దీన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

RSS
Follow by Email
Latest news