హైదరాబాద్ నగరంలోని బోరబండ పెద్దమ్మనగర్లో విషాదఘటన చోటుచేసుకుంది. సత్యవాణి అనే గృహిణి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. తనూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఈ ఘటనలో ఐదేళ్ల కుమారుడు మృతిచెందగా, రెండేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కుటుంబ కలహాలతో ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.











