Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కేజ్రీవాల్​ కేబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా  తన ​మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోనున్నారు. ఈ మేరకు వారి ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్​గవర్నర్​కు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్​ ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను కేజ్రీవాల్ తన   క్యాబినెట్​లోకి తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా, లిక్కర్ స్కామ్ కేసుతో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో మరో మంత్రి సత్యేంద్ర జైన్ లు మంత్రి పదవులకు రాజీనామాల చేశారు. వారి రాజీనామాలు  ఆమోదించి 24 గంటలు కూడా గడవక ముందే వారి స్థానంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు తన​ మంత్రివర్గంలో చోటు కల్పించారు.

RSS
Follow by Email
Latest news