సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. మహ్మద్ అమీర్ తెలిపారు. గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో రెవెన్యూ తదితర శాఖలో సమాచార హక్కు చట్టం కేసుల దర్యాప్తు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టంపై సమన్వయ పరిచే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రజలకు అందుబాటులో కేసుల పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక క్యాప్ నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ రోజు హనుమకొండలో పెండింగ్ లో సుమారు 10 కేసులను ధరస్తుదారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యం అయినంత వరకు పెండింగ్ కేసులు త్వరగా పరిష్కారం చేయాలని ప్రజా సమాచార అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గతంలో సమాచార హక్కు చట్టం కేసులు హైదరాబాద్ నగరం నుండే విచారణ నిర్వహించేదని అందువల్ల ధరకాస్తు దారులు రావడం కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి కోసం జిల్లాల్లో విచారణలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి వాసు చంద్ర, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ ప్రకాశ్, ప్రజా సమాచార అధికారులు, ధరకాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.