Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెదేపా విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

◆ఐక్యమత్యంగా పని చేయాలి.

◆యువతే తెలుగుదేశం ఆయుధం.

◆ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలి.

◆మహానాడును విజయవంతం చేయాలి.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఇసుకదర్శి క్యాంపు కార్యాలయంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వంపై పోరు సాగించాలన్నారు.

యువత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. పేద ప్రజల నడ్డివిరుస్తు కరెంటు ఛార్జీలను అమాంతం పెంచి కోతలతో వారి జీవనాన్ని దెబ్బతీశారని ఏలూర్ విమర్శించారు. యువత ముఖ్య భూమిక పోషించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పని చేసిన చంద్రబాబు నీ మరలా సీఎంగా గెలిపించుకోవాలని ఆయన కోరారు. చదువుకున్న యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడాలన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. నాడు అభివృద్ధిలో అడుగులు వేస్తున్న రాష్ట్రం తిరోగమన దిశలో వెళ్తుందన్నారు. రేపటి తరాల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందన్నారు. గ్రామాల్లోని సమస్యలపై ఆయా గ్రామాల నాయకులు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జాడ లేదని వాపోయారు.

నియోజకవర్గంలోని ఆయా మండలాల తెదేపా నాయకులు కారంచేడు మండల అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీహరి, ఇంకొల్లు మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, చిన్న గంజాం మండల అధ్యక్షుడు పొద వీరయ్య, వీరగంధం ఆంజనేయులు, పర్చూరు మండల ప్రధాన కార్యదర్శి కొరిటాల సురేష్, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షుడు అప్పలనేని నరేంద్ర, నాయకులు కామేపల్లి హరిబాబు, శ్రీనివాసరావు, హర్శ, నాగేశ్వరావు, సురేష్, కొమ్మి మహేష్, జనార్దన్ , ఫారూఖ్, నాగరాజు,శ్యామ్, రామాంజనేయ రెడ్డి, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news