Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నా రక్తాన్ని చిందించేందుకు రెడీ..: సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే బీజేపీ నాయకుల ప్రయత్నాలను  అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాలని స్థానిక బీజేపీ నేతలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఉద్యమాన్నిసైతం నిర్వహిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుల డిమాండ్ పట్ల మమత బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించేందుకు తాను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనని అన్నారు.

 

RSS
Follow by Email
Latest news