Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీ నూతన మంత్రివర్గం ఇదే…!

గతంలో చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరించారు. అందులోభాగంగా ఏపీ లో 25 మందితో కొత్త మంత్రివర్గం నేడు కొలువు తీరనుంది. కొత్త మంత్రులతో సోమవారం రుదయమ్ 11.31 గంటలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అందులో 11 మంది పాతవారు ఉండగా, కొత్తగా మరో 14 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కు మరోసారి అవకాశం కల్పించారు.

కొత్త మంత్రి వర్గంలో పాటవారు : 1) పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి (పుంగనూరు), 2) బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), 3) బుగ్గనరాజేంద్రనాథ్‍రెడ్డి(డోన్), 4) పినిపే విశ్వరూప్ (అమలాపురం),5) కె.నారాయణ స్వామి (గంగాధర,నెల్లూరు), 6) సీదిరి అప్పలరాజు(పలాస), 7) తానేటి వనిత(కొవ్వూరు), 8) చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), 9) గుమ్మనూరు జయరాం (ఆలూరు), 10) అంజాద్ బాషా(కడప), 11) ఆదిమూలపు సురేష్ (సంతనూతలపాడు).

కొత్తగా మంత్రివర్గంలో చేరబోయేవారు : 1) ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం), 2) పీడిక రాజన్నదొర(సాలూరు), 3) గుడివాడ అమర్నాథ్ (అనకాపల్లి), 4) బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), 5) దాడిశెట్టి రాజా(తుని), 6 కారుమూరి వెంకట నాగేశ్వరావు (తణుకు), 7) కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగుడెం), 8) జోగి రమేష్(పెడన), 9) అంబటి రాంబాబు (సత్తెనపల్లి), 10) మేరుగ నాగార్జున (వేమూరు), 11) విడుదల రజిని (చిలకలూరిపేట), 12) కాకాణిగోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి), 13) ఆర్కే రోజా(నగిరి), 14) ఉషా శ్రీ చరణ్(కళ్యాణదుర్గం), 15) తిప్పేస్వామి(మడకశిర).

RSS
Follow by Email
Latest news