పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలనే బీజేపీ నాయకుల ప్రయత్నాలను అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాలని స్థానిక బీజేపీ నేతలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఉద్యమాన్నిసైతం నిర్వహిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుల డిమాండ్ పట్ల మమత బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించేందుకు తాను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనని అన్నారు.