Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కూడా చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సుదర్శన్ రాజ్

వరంగల్ కాకతీయ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుందర్ రాజ్ యాదవ్ నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల సమక్షంలో అయనను ఆ సీటులో కూర్చోబెట్టారు. పలువురు నేతలు కుడా చైర్మన్ సుదర్శన్ రాజ్ ని అభినందించారు. ఈసందర్బంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ… ఉద్యమానికి, పార్టీకి సుందర్ రాజు ఎనలేని సేవ చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికీ సీఎం కెసిఆర్, కేటీఆర్ తప్పకుండా న్యాయం చేస్తారని తెలిపారు.

వరంగల్ మహా నగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్ధి సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు. కుడా చైర్మన్ గా కడియం శ్రీహరి గతంలో సమర్థవంతంగా పని చేశారని కొనియాడారు. అలాగే సుందర్ రాజ్ కుడా అభివృద్ధికి పాటు పడాలని, అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్, కుడా వైస్ చైర్మన్, ఇతర అధికారులు, తదితరులు హాజరై కూడా నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

RSS
Follow by Email
Latest news