రాహుల్ గాంధీ వస్తున్నటువంటి రైతు సంఘర్షణ సభ పై సమీక్ష సమావేశాన్ని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సింగపురం ఇందిర నిర్వహించారు. నియోజకవర్గంలోని చిల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ సోమేశ్వర్ రెడ్డి గారు పీసీసీ సభ్యులు గంగారపు అమృత రావు గారు హాజరైనారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…రాహుల్ గాంధీ హాగరవుతున్న రైతు సంఘర్షణ సభ కు నియోజక వర్గ ప్రజలు భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. అధికార టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రైతులను నట్టేట ముంచిందన్నారు. అలంటి పార్టీని భూస్థాపితం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జనగాం జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ రెడ్డి, జనగాం జిల్లా కార్యదర్శి దుర్గాకేసీ ప్రసాద్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్, మండల అధికార ప్రతినిధి సునీల్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు రజిని, నష్కల్ ఎంపిటిసి శిరీష సురేష్ తదితరులు పాల్గొన్నారు.