Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మార్కెట్ లోకి నోకియా నయా మొబైల్ ఫోన్ లు…!

మొబైల్ ఫోన్ల రంగంలో నోకియా ఫోన్ లు ఒకప్పుడు నెంబర్ వన్ గా చలామణి అయినా విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడంతో కాలక్రమేనా ఆ ఫోన్ లు కనుమరుగైపోయాయి. కొత్త కొత్త ఫీచర్ లతో స్మార్ట్ ఫోన్లు వచ్చాక నోకియా మనుగడే ప్రశ్నార్థకంగా తయారైంది. శాంసంగ్ వంటి కంపెనీల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక మార్కెట్ పరంగా పతనం చవిచూసింది. నిదానంగా మళ్లీ మార్కెట్ లోకి వచ్చిన నోకియా… హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా తన ఫోన్ లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతోంది.

నోకియా నుంచి తాజాగా జీ21 ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. భారత్ లో దీని ధర రూ.12,999 అని తెలుస్తోంది. ఇందులో ప్రారంభ వెర్షన్ ఫోన్ లో 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజి సదుపాయం ఉంది. మరో వెర్షన్ 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజితో అందుబాతీసుకువచ్చారు. దీని ధర రూ.14,999. గా కోట్ చేశారు.

దీని ప్రత్యేకతలు…

ఈ ఫోన్ తన సెగ్మెంట్లో రెడ్ మీ, రియల్ మీ, శాంసంగ్ ఫోన్లకు పోటీనిస్తుందని భావిస్తున్నారు. 6.5 అంగుళాల డిస్ ప్లే, హెచ్ డీ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ బటన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇది రెండు కలర్లలో లభ్యం అవుతుంది. 1) నార్డిక్ బ్లూ, 2)డస్క్ కలర్లలో అందుబాటులో ఉంటాయి. ఇందులో 50 ఎంపీ సామర్థ్యంతో ఏఐ ఇమేజింగ్ తో కూడిన ట్రిపుల్ కెమెరా పొందుపరిచారు. నోకియా జీ21లో లాంగ్ లైఫ్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ చార్జింగ్ తో మూడ్రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇతర కంపెనీలకు దీటుగా అత్యధిక రిఫ్రెష్ రేటు కలిగివున్నట్టు తెలుస్తోంది.

RSS
Follow by Email
Latest news