2022 జూన్ 14న శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకోతపల్లి గ్రామం మరియు మండలంలో 2021 ఖరీఫ్ పంట బీమాను రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన 30,267మంది రైతులకు ఈ ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
శనివారం రోజున జిల్లాలో సంబంధిత రైతు భరోసా కేంద్రాల స్థాయిలో సోషల్ ఆడిట్ డిస్ప్లే కోసం గ్రామ వ్యవసాయ సహాయకులు లాగిన్లో తాత్కాలిక లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించడం జరిగిందని ఆయన అన్నారు. అభ్యంతరాలకు జూన్ 11 నుంచి 13 వరకు గడువు ఉందని, క్షేత్రస్థాయి కార్య నిర్వాహకులు జాబితాను ప్రచురించి, విధి ఫోటోలను YSR యాప్లో అప్లోడ్ చేయాలని సూచించడం జరిగిందన్నారు. తాత్కాలిక జాబితా ప్రక్రియను పూర్తి వివరాలతో ధృవీకరించవచ్చునని తెలిపారు. జోడించిన వినియోగదారుల మాన్యువల్లో ప్రక్రియ వివరంగా వివరించబడిందన్నారు.
ప్రచురించిన జాబితాలో రైతులు లేవనెత్తిన ఏవైనా అభ్యంతరాలను సంగ్రహించవలసి ఉంటుందని మరియు అభ్యంతరాలకు సంబంధించిన క్లెయిమ్లను మండల వ్యవసాయ అధికారి స్థాయిలో పరిశీలన తర్వాత విడిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. 2021 ఖరీఫ్ పంట బీమా గా రాష్ట్రంలో 15.61 లక్షల మంది రైతులకు రూ. 2977.82 కోట్ల క్లెయిమ్లు పరిష్కరించగా, అందులో తూర్పు గోదావరి జిల్లాకి చెందిన 30,267మంది రైతులకు
రూ.59.49 కోట్లు విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాశాఖ అధికారి తెలిపారు.