కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యకతం అవుతున్నాయి. ఈ క్రమంలో పలుప్రాంతాల్లో నిరసనకారులు రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేశారు. దింతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. అయితే నిరసనకారులు రైల్వే ట్రాక్ ల పైనుంచి వెనుదిరుగుతున్నారు.
కాసేపట్లో స్టేషన్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు. ఈక్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రాత్రి 7గంటల నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. స్టేషన్ క్లియర్ అయిన గంటలోనే రైళ్లు నడిచేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దెబ్బతిన్న సిగ్నలింగ్ వ్యవస్థలో ఇప్పటికే రిపేర్లు మొదలు పెట్టారు.