Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

చరిత్రలో ఈరోజు జులై 21న

💫 సంఘటనలు 💫

0356 బి.సి.: హెరోస్ట్రేటస్ అనే యువకుడు, ప్రపంచపు 7 వింతలలో ఒకటైన, ఎఫెసిస్ లో ఉన్న ఆర్టెమిస్ ఆలయానికి, నిప్పు పెట్టాడు.

1588: స్పానిష్ ఆర్మడాని ఇంగ్లీష్ వారి నౌకాదళం ఓడించింది.

1667: బ్రేడా సంధి జరిగింది. దీనివలన రెండావ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అంతమైంది.

1718: పస్సరోవిట్జ్ సంధి, ఒట్టోమన్ సామ్రాజ్యానికి, ఆస్ట్రియాకి, రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ కి మధ్య జరిగింది.

1798: నెపోలియన్ యొక్క ఈజిప్షియన్ సైన్యం నెపోలియన్ యొక్క ఈజిప్షియన్ ప్రచారంలో ఈ రోజు 1798 లో పిరమిడ్ల యుద్ధంలో మురాద్ బే యొక్క ఈజిప్షియన్ దళాలను ఓడించడానికి భారీ డివిజనల్ స్క్వేర్ అనే కొత్త సైనిక వ్యూహాన్ని ఉపయోగించింది.

1831: బెల్జియం జాతీయ దినోత్సవము. నెదర్లాండ్ నుంచి బెల్జియమ్ స్వాతంత్ర్యం పొందింది. లియోపోల్డ్ I రాజు అయ్యాడు.

1873: అయోవా (పశ్చిమ అమెరికా) రాష్ట్రంలోని అడేర్ దగ్గర జెస్సె జేమ్స్, జేమ్స్ యంగర్ ముఠా మొదటిసారిగా రైలు దోపిడీ చేసారు.

1904: కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

1931: సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది.

1934: గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్‌హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు.

1940: ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది.

1944: జపాన్ ఆక్రమించిన ‘గువామ్’ అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం).

1947: భారత జాతీయ జెండాను రాజ్యాంగ సభ ఆమోదించింది.

1949: అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేసింది.

1954: జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు.

1954: ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది.

1959: ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక ‘సవన్నా’ జల ప్రవేశం చేసింది.

1960: సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు)

1960: అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది.

1961: మెర్క్యురీ 4 (మెర్క్యురీ – రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం)

1965: పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి.

1969: అపోలో 11: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 2:56:15 AM (GMT)కి చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అయ్యాడు

1977: నీలం సంజీవ రెడ్డి భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, ‘సెయింట్ బెర్నార్డ్’ జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి.

1980: జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు.

1983: పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లాని ఎత్తివేసింది.

1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్‌టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది.

1984: తూర్పు జర్మనీకి చెందిన ‘మారిటా కోచ్’ 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

1988: ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది.

1990: తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు.

2005: లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి.

2007: జేకే రౌలింగ్ యొక్క హ్యారీ పోటర్ సిరీస్‌లోని చివరి పుస్తకం హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ విడుదలైంది.

2011: యూఎస్ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ 135 మిషన్ల తర్వాత , ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లోని నాసా యొక్క జాన్ ఎఫ్. కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో ఆర్బిటర్ అట్లాంటిస్ దిగడంతో ముగిసింది.

2018: కార్యకర్తల ప్రచారం తర్వాత భారతదేశం శానిటరీ ఉత్పత్తులపై పన్నును రద్దు చేసింది.

🎂 జననాలు 🎂

1891: జైరామదాస్ దౌలత్రం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయ రాజకీయ నాయకుడు.

1899: ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత

1911: ఉమాశంకర్ జోషి గుజరాతీ సాహిత్యానికి చేసిన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ కవి, పండితుడు మరియు రచయిత.

1921: పాములపర్తి సదాశివరావు ఆలోచనాపరుడు, తత్వవేత్త మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్టు.

1923: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005)

1927: మహ్మద్ షకీల్ లక్నో నగరానికి చెందిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, ఉర్దూ నవలా రచయిత, ట్రేడ్ యూనియన్ కార్యకర్త మరియు కార్మిక న్యాయవాది.

1940: శంకర్‌సింగ్ వాఘేలా, భారతీయ రాజకీయ నాయకుడు మరియు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.

1968: ఆదిత్య శ్రీవాస్తవ, థియేటర్ ఆర్టిస్ట్, మరియు, భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటుడు.

1961: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988)

1966: అనురాధ (నటి), తెలుగు నృత్యతార, సుమారు 35 చిత్రాలలో నటించింది.

1969: పసునూరు శ్రీధర్ బాబు, పాత్రికేయుడు, కవి.

1969: కుడమలూరు జనార్దనన్, కర్నాటక సంగీత సంప్రదాయానికి చెందిన భారతీయ ఫ్లూటిస్ట్.

1978: ఆశిష్ చౌదరి, భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటుడు.

1981: శైలి చోప్రా, భారతీయ వ్యాపార పాత్రికేయురాలు, రచయిత్రి మరియు వ్యవస్థాపకుడు.

1985: సంగ్రామ్ సింగ్, భారతీయ రెజ్లర్, నటుడు, ప్రేరణాత్మక వక్త, పరోపకారి మరియు ఆరోగ్య గురువు.

1989: వరుణ్ సందేశ్, భారతీయ అమెరికన్ చలనచిత్ర నటుడు మరియు టెలివిజన్ వ్యక్తిత్వం ప్రధానంగా తెలుగు సినిమాలో తన రచనలకు ప్రసిద్ధి చెందింది.

1989: మధు షాలిని, ఒక భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్, ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పని చేస్తుంది.

1990: సత్యజీత్ దూబే, భారతీయ గాత్ర మరియు చలనచిత్ర నటుడు, హిందీ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నారు.

1993: సందేశ్ జింగాన్, భారత జాతీయ జట్టుకు సెంటర్ బ్యాక్‌గా ఆడిన భారతీయ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు.

1996: శుభంకర్ శర్మ, భారతదేశానికి చెందిన ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు.

💥 మరణాలు 💥

1796: రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి.

1906: వోమేష్ చంద్ర బొన్నర్జీ భారతీయ న్యాయవాది.

1948: అర్షిలె గోర్కీ, అబ్‌స్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిస్ట్, 43వ ఏట.

1967: ఆల్బర్ట్ జాన్ లుతులీ , ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (1952-60) అధ్యక్షుడు మరియు శాంతి కొరకు నోబెల్ బహుమతి పొందిన మొదటి ఆఫ్రికన్ (1960), రైలు ఢీకొని మరణించాడు.

1982: బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా నేపాలీ రాజకీయవేత్త మరియు ఫలవంతమైన రచయిత, అతను భారతదేశంలో జన్మించాడు.

1998: అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి.

2001: శివాజీ గణేశన్ ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత.

2001: కెవి మహదేవన్ ఒక భారతీయ స్వరకర్త, గాయకుడు-గేయరచయిత, సంగీత నిర్మాత మరియు సంగీతకారుడు తమిళ సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందారు.

2009: గంగూబాయి హంగల్ కర్ణాటకకు చెందిన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క ఖ్యాల్ శైలికి చెందిన భారతీయ గాయని. పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత.

2013: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932)

RSS
Follow by Email
Latest news