ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఘోర పరాభవం చవిచూసింది. ప్రభుత్వ వ్యతిరేకత విద్యావంతుల్లో స్పష్టంగా కనపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను కైవశం చేసుకుని తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజకేతనం ఎగురవేసింది.ఎగురవేయడం ఎవరూ ఊహించని పరిణామం.దింతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుని, తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫలితాలపై ఆపార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు తెలిపారు. అలాగే వారిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు, ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు హ్యాట్సాఫ్ అన్నారు. ఇది ప్రజా విజయం, రాష్ట్రానికి శుభసూచకం” అని అభివర్ణించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసనమండలికి వెళుతున్న వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు.