Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం : దాస్యం వినయ్ భాస్కర్

సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈరోజు  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతూ..లబ్ధిదారులకు సియం సహయ నిధి చెక్కులను పంపిణి చేశారు. ఎండను సైతం లెక్క చేయక ఇంటింటికి తిరుగుతూ లబ్దిదారులకు చెక్కులను అందించారు. ఈ క్రమంలో పలువురు నిండు మనస్సుతో ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ వారి ఆర్థిక స్వాలంభనే లక్ష్యంగా  ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 

?గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపారిపలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
?ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ఇంటింటికి తిరుగుతూ సియం సహయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
?నిరుపేదలకు సాయం సియం సహయ నిధి.
?ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భరోసా కల్పిస్తోంది.
?సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం
?ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారు.
?సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయి.
?ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తుంది.
? ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది.
?పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తోంది.
?ఈరోజు వరంగల్ పశ్చిమ నియెజకవర్గ వ్యాప్తంగా 33 మంది లబ్ధిదారులకు దాదాపు 28 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందించాడం జరిగిందని వినయ్ భాస్కర్ తెలిపారు.

?చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మార్గం మధ్యలో స్థానిక ప్రజలతో కలిసి నిమ్మరసం తాగుతున్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్.

RSS
Follow by Email
Latest news