Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

న్యూస్ కవరేజికి వెళ్ళిన జర్నలిస్ట్ నదిలో గల్లంతు..

ప్రభుతాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే వాడు జర్నలిస్ట్. ప్రజలకు ఏ సమస్యలు వచ్చిన ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు అందరికి తెలిసేలా తన వార్త కథనాలతో మీడియా ద్వారా అందరిని అప్రమత్తం చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సంబందించిన న్యూస్ అప్డేట్స్ అందించేందుకు కరీంనగర్ కు చెందిన ఓ జర్నలిస్ట్ ఇలాగే, న్యూస్ కవరేజ్ నిమిత్తం వెళ్ళి, వరదల్లో చిక్కుకుని గల్లంతైన ఘటన అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే…  రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద 9 మంది వ్యవసాయ కూలీలు గోదావరి నదిలో చిక్కుకోగా, ఆ వార్త కవర్ చేసేందుకు ఎన్టీవీ రిపోర్టర్ జమీల్ వెళ్ళారు. అనూహ్యంగా ముంచుకొచ్చిన వరద కారణంగా జమీర్ తన వాహనంతోపాటు నదిలో కొట్టుకుపోయాడు. గల్లంతయిన జర్నలిస్టుని కనుగొనేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆశిస్తున్నారు.

RSS
Follow by Email
Latest news