కోల్కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ గనుక భారత్పై ఏవైనా దుస్సాహసాలకు పాల్పడితే.. ప్రపంచ పటంలో ఆ దేశం నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. గతేడాది పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని ఈ సందర్బంగా అయన గుర్తు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న రాజ్నాథ్ సింగ్, పాక్ మంత్రి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. 1971 నాటి భారత్-–పాక్ యుద్ధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ ‘‘55 ఏండ్ల క్రితం చేసిన తప్పుకు ఆ దేశం రెండు ముక్కలైంది.











