తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గ్తు సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శాసనసభ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎల్. రమణ, దండే విఠల్, శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి చార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
