అంబర్ పేట నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ సమస్య మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఆందోళన వెలిగించారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి గాను అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు. జలమండలి ఎండి అశోక రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో అంబర్పేట ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు అధికారులతో కలిసి ఈరోజు అంబర్ పేట ప్రాంతంలో పర్యటించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వెంకటేష్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోనున్నట్లు అయన హామీ ఇచ్చారు.











