భద్రాద్రి రామయ్యకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను కోరుకొండకు చెందిన భక్త బృందం సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో శిరసుపై గోటి తలంబ్రాలు ధరించి రామాలయంకు చేరుకుని గిరిప్రదక్షణ నిర్వహించారు. దేవస్థానం ఈవో కే దామోదర్ రావు, ఏఈఓ శ్రవణ్ కుమార్,వైదిక పరిపాలన సిబ్బందికి తలంబ్రాలను అందజేయగా, వీటిని ఈ నెల 27 వ తేదీన శ్రీరామనవమి నాడు జరిగే రామయ్య కళ్యాణంలో ఉపయోగించనున్నారు.











