ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడకు విచ్చేసిన కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న అయనకు ఆర్ ఎఫ్ సి ఎల్ సిఈఓ అలోక్ సింఘాల్ ,ఎన్ టి పి సి ఎస్ సునీల్ కుమార్ , పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్ ఎఫ్ సి ఎల్ జి ఎం జా, స్వాగతం పలికారు . ఈ కార్యక్రమంలో ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
